Jani Master: జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్

జానీ మాస్టర్ భార్య అయేషా తనకు న్యాయం చేయాలని ఫిలిం ఛాంబర్‌ ను ఆశ్రయించింది. తన భర్తను ట్రాప్‌ చేసి ప్రేమ పేరుతో ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతి వేధించిందని.. ఈ విషయంపై తాను సూసైడ్ చేసుకునే దాక వెళ్లానని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

New Update
JANI MA

Jani Master Case: అత్యాచారం కేసులో అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ భార్య అయేషా  అలియాస్ సుమలత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తన భర్తను ట్రాప్‌ చేసి ప్రేమ పేరుతో బాధిత వేధించిందని ఆమె పేర్కొంది. కొరియోగ్రాఫర్‌గా అవకాశం కోసమే ఇలా చేసిందని తెలిపింది. ఐదేళ్లుగా తనకు బాధిత నరకం చూపించిందని పేర్కొంది.

ALSO READ: నేడు తిరుపతికి సిట్ బృందం

సూసైడ్ చేసుకోవాలనుకున్న...

బాధిత పెట్టె టార్చర్ తనను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని ఆమె పేర్కొంది. తన భర్త ఇంటికి రాకుండా బాధిత అడ్డుకునేదని చెప్పింది. బాధితురాలు ఇంటికి వెళ్లి నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పానని.. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు... మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని చెప్పింది. తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో బాధితురాలికి సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు