/rtv/media/media_files/2025/03/15/ThWujDBx2zStaRhDKQIf.jpg)
manchu vishnu about Prabhas
Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదలకు మరో రెండు రోజులు ఉందనగా.. చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. 'కన్నప్ప' టీమ్ పై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణుతో సహా పలువురి ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ కట్టారా, లేదా? అనే విషయాలను ఆరా తీసినట్టు సమాచారం. అలాగే 'కన్నప్ప' బడ్జెట్ పై కూడా ఆరా తీసినట్లు టాక్.
ఇది కూడా చూడండి: Kuberaa Movie: బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్న 'కుబేరా'.. వారంలోనే 100కోట్ల క్లబ్ లోకి!
నాకేం తెలియదు..
అయితే ఈ సోదాల గురించి మంచు విష్ణును విలేకర్లు ప్రశ్నించగా.. ఆయన తనకేమి తెలియదంటూ బదులిచ్చారు. ''మా ఆఫీసులపై సోదాలు జరుగుతున్నట్లు నాకు తెలియదు. ఇంకొక 24 గంటల్లో కన్నప్ప ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.. ఆ హడావుడిలోనే ఉన్నాను. మీ ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది'' అని అన్నారు. మరి ఇంత సడెన్ గా కన్నప్ప టీమ్ పై సోదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియదు.
ఈనెల 27న
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన 'కన్నప్ప' ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదల కానుంది. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో టాక్. అంతర్జీతీయా స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్, లొకేషన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో క్యామియోలు చేయడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచు విష్ణు హిందీ ఫైనల్ కాపీని పలువురు ప్రముఖుల కోసం ప్రదర్శించగా.. వారి నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ప్రేక్షకులు కూడా అదే చెబుతారని కోరుకుంటున్నాని అని అన్నారు.