కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి రేప్.. హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్

హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు హర్ష ఇల్లీగల్ లిక్కర్ మాఫీయాలో కోట్లు సంపాదించినట్లు బాధితురాలు మాట్లాడిన మరో ఆడియో లీకైంది.

New Update

Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష కేసులో రోజుకో ట్విస్టు చోటుచేసుకుంటోంది. తాజాగా బాధితురాలు మరో సంచలన విషయం బయటపెట్టింది. హర్ష సాయి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి రేప్ చేసి.. ఆ వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె సమర్పించిన ఆధారాల ప్రకారం.. పోలీసులు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సప్ చాటింగ్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే  బాధితురాలికి సంబంధించిన  వైద్య పరీక్షల రిపోర్టులు  కూడా నార్సింగి  పోలీసులకు చేరినట్లు సమాచారం. 

హర్ష సాయి ఇల్లీగల్ లిక్కర్ మాఫీయా 

మరో వైపు హర్ష సాయి కోసం గాలింపు చర్యల చేపట్టిన పోలీసులు..  అతడు బెంగళూరు లేదా గోవా పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా తెలిపారు. ఇది ఇలా ఉంటే బాధితురాలికి సంబంధించిన మరో ఆడియో లీకైంది. హర్ష సాయి  ఇల్లీగల్ లిక్కర్ మాఫీయా ద్వారా  కోట్లు సంపాదించినట్లు ఆమె వీడియోలో తెలిపింది. 

అసలు విషయమేంటంటే 

ఇటీవలే ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని నార్సింగ్ పోలీసు స్టేషన్‌‌లో కేసు పెట్టింది.  హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా  కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను  మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

#harsha-sai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి