35 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై  ఆల్ టైమ్ క్లాసిక్.. 3D వెర్షన్ లో

చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 35 ఏళ్ల తర్వాత  మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. మే 9, 2025న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. సరికొత్త మెరుగులతో 3D ఫార్మాట్లో సినిమాను విడుదల చేస్తున్నారు.

New Update

Jagadeka Veerudu Athiloka Sundari re release  తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ఆల్ టైం సూపర్ హిట్ క్లాసిక్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. 1990లో మెగాస్టార్- దివంగత నటి శ్రీదేవి జంటగా వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ అప్పట్లో బంపర్ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.  అప్పటికే ఇండస్ట్రీలో లీడింగ్ యాక్టర్లుగా రాణిస్తున్న చిరంజీవి, శ్రీదేవి ఈ సినిమాతో దక్షిణ పరిశ్రమలోనే టాప్ స్టార్స్ గా ఎదిగారు. ఈ సినిమా విడుదలై 35 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మేకర్స్ అభిమానుల కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. 

మరోసారి వెండితెరపై 

దాదాపు ఏళ్ల తర్వాత మళ్ళీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వెండితెరపై సందడి చేయబోతుంది. మే 9, 2025న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు. సరికొత్త మెరుగులతో 2D, 3D ఫార్మాట్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో శ్రీదేవి, మెగాస్టార్ అభిమానులు ఆనందంలో తెలుస్తున్నారు. అయితే రీ రిలీజ్ రోజు నటి శ్రీదేవి బర్త్ డే కూడా కావడం విశేషం. 

రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మే మొదటి వారంలో ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెగాస్టార్ కుటుంబం అంతా రీ రిలీజ్ రోజున థియేటర్స్ లో సందడి చేయనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాఘవేంద్ర రావు సృష్టించిన ఈ కళా ఆద్భుతంలో యెండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్, తదిర ప్రముఖ రచయితలు భాగమయ్యారు. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించారు.

telugu-news | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు