Partho Ghosh: విషాదం.. గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

ప్రముఖ భాలీవుడ్ సినీ దర్శకుడు పార్థో ఘోష్ తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలో నిన్న సాయంత్రం 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన బౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.  

New Update
bollywood director Partho Ghosh Passes Away At 75 years

bollywood director Partho Ghosh Passes Away At 75 years

ప్రముఖ భాలీవుడ్ సినీ దర్శకుడు పార్థో ఘోష్ తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలో నిన్న (సోమవారం) సాయంత్రం 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన బౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.  

Partho Ghosh Passes Away

ఇదిలా ఉంటే పార్థో ఘోష్1991లో ‘100 డేస్’ మూవీతో అద్భుతమైన విజయం అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తీస్రా కౌన్, అగ్ని సాక్షి వంటి విజయవంతమైన చిత్రాలతో మరింత క్రేజ్, పాపులారిటి తెచ్చుకున్నారు. అతను మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇలా 1991 లో '100 డేస్' సినిమాతో పెద్ద బ్రేక్ ని అందుకున్నాడు. 

 ఆ తర్వాత 1993 లో 'దలాల్' సినిమాకి దర్శకత్వం వహించాడు. అది కూడా భారీ విజయాన్ని సాధించింది. అతను 15 కి పైగా సినిమాలకు రచన, దర్శకత్వం వహించాడు. పార్థో చివరిగా 2018లో 'మౌసమ్ ఇక్రార్ కే దో పాల్ ప్యార్ కే'కి దర్శకత్వం వహించాడు. పార్థో ఘోష్‌కి అతని భార్య గౌరీ ఉంది. 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు