నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం.. !

టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం చోటుచేకుంది. ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోదరి కుమారుడు సురేష్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. సురేష్.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'అప్పుల అప్పారావు' మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రాజకీయంగానూ ఆయన బాగా ఎదిగారు.

New Update
Rama Prabha

Rama Prabha

Rama Prabha:  తెలుగు సీనియర్ నటి రమా ప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి కుమారుడు సురేష్ ఆకస్మికంగా మరణించారు. ఇటీవలే తీవ్ర అస్వస్ధతకు గురైన సురేష్ బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే సురేష్ గత 9 నెలలుగా  కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. సురేష్ ఇటీవలే  నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి పెద్దకర్మ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఆయన మరణించడం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. 

నిర్మాతగా వ్యవహరించిన సురేష్ 

సురేష్ సినిమాల్లో కూడా పనిచేశారు. రమాప్రభ సమర్పణలో రూపొందిన 'అప్పుల అప్పారావు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. సినిమాలతో పాటు ఆయన రాజకీయంగానూ బాగా ఎదిగారు. 

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

Also Read:  ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Also Read: ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే

Advertisment
Advertisment
తాజా కథనాలు