రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చిన భోజనాన్నే చేయనున్నారు. భోజనం అనంతరం తిరిగి రెండు గంటలకు విచారణ ప్రారంభంకానుంది. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు విచారణ కొనసాగనుంది. విచారణ ముగిసన తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. విచారణకు మరో 3 గంటల సమయం మాత్రమే సీఐడీకి మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్
Chandrababu CID Interrogation: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
Translate this News: