BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు..బావిలో తలనీలాలు లభ్యం..!!

భవ్యశ్రీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. దర్యాప్తులో భాగంగా తలనీలాలను ఫారెన్ సీక్ ల్యాబ్ కు పంపారు ఐవో అనిల్ కుమార్‌. భవ్య శ్రీ కేసు పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి అంటున్నారు అధికారులు.

New Update
BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు..బావిలో తలనీలాలు లభ్యం..!!

BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. దర్యాప్తులో భాగంగా తలనీలాలను ఫారెన్ సీక్ ల్యాబ్ కు పంపారు ఐవో అనిల్ కుమార్‌. భవ్య శ్రీ కేసు పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి అంటున్నారు అధికారులు. ఏపీలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి అంశంపై RTV వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీవీ కథనాలకు స్పందిచిన అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తున్నామని విచారణాధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ కేసు విషయమై ఉన్నతాధికారుల నుండి తమకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయన్నారు.

భవ్యశ్రీ మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. చిత్తూరు జిల్లా కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది.

బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి.. భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో‌ మునిగిపోయారు‌. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మూడ్రోజులుగా శవం నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. అయితే గ్రామస్తులు, కుటుంబసభ్యులు మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. భవ్యశ్రీ మృతిదేహం లభించిన బావి వద్దకు వెళ్లి.. సంఘటనాస్థలిని చిత్తూరు డీఎస్పీ పరిశీలించారు. నలుగురు యువకులపై అనుమానం ఉందని చెప్పడంతో.. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. అఘాయిత్యం జరిగిందా..? విషప్రయోగం జరిగిందా..? అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్‌ను తిరుపతి RFSLల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు