AP: వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satynarayana) నటుడు చిరంజీవి (Chiranjeevi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. విభజన సమయంలో జరిగిన సంఘటనలతోపాటు చిరంజీవి రాజకీయం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే అప్పుడే ముఖ్యమంత్రి(CM) అయ్యేవారని చెప్పారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తనను ముఖ్యమంత్రి కాకుండా చిరు అడ్డుపడ్డాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..AP: నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఏపీకి తాను సీఎం కాకుండా చిరంజీవి అడ్డకున్నారని వైసీపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆరోపించారు. తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ సీఎం అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో చిరు ఉండేవారని చెప్పారు. తాను చిరుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
Translate this News: