/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Earthquake-In-Chhatisgarh-jpg.webp)
ఛత్తీస్గఢ్లోని గోరెలా-పెండ్రా-మార్వాహి, కోర్బా జిల్లాల్లో భూంకంపం సంభవించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజల్లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బైకుంత్పూర్లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్లో భూకంప కేంద్రం కోర్బా జిల్లాలోని పసన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.
भूकंप के झटकों से हिला छत्तीसगढ़
— News24 (@news24tvchannel) August 13, 2023
◆ गौरेला-पेंड्रा-मरवाही और कोरबा जिले में महसूस किये गए झटके
◆ रिक्टर स्केल पर भूकंप की तीव्रता 3.9 #Earthquake | #chhattisgarh | Earthquake in Chhattisgarh pic.twitter.com/Uxs6vVYTga
స్థానిక అధికారుల ప్రకారం, భూకంపం కారణంగా పెద్ద ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. ఆగస్టు 10న హిమాచల్ ప్రదేశ్లో కూడా భూకంపం సంభవించింది. ఇటీవలి కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు పెరుగుతున్నాయి. మన భూమి లోపల 7 టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లు నిరంతరం వాటి స్థానంలో తిరుగుతూ ఉంటాయి. అయితే, కొన్నిసార్లు వారి మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ కారణంగా, భూమిపై భూకంపాలు సంభవించే సంఘటనలు కనిపిస్తాయి.
#Earthquake M3.6 India: Korba, Chhattisgarh 13 Aug 03:39 UTC - report/info: https://t.co/kDJaHFMkrs
— Earthquake Monitor (@EQAlerts) August 13, 2023