Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్

రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.

New Update
Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్

Chandrababu Naidu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే..అమరావతి వెలవెలబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (ChandraBabu Naidu) తిరువూరు (Tiruvuru) లో జరిగిన బహిరంగ సభలో అన్నారు. జగన్‌ రెడ్డి (Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రం ఆయన చేతిలో పడి నాశనం అయిపోయిందని విమర్శించారు.

రాష్ట్రాన్ని నాశనం చేశాడు..

ఆదివారం తిరువూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ రివర్స్‌ పాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని, ఒక తరం ఇంతగా నష్టపోయిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్నే నాశనం చేశారని, ధాన్యం రైతులు దగా పడ్డారని చెప్పారు.

అప్పుల్లో మొదట..ఆత్మహత్యల్లో రెండు..

రాష్ట్ర రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. సైకో ప్రభుత్వం పోయి టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తేనే రైతుల బతుకులు, రాష్ట్రం రెండు కూడా బాగుపడతాయని చెప్పారు. '' మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది. ఏపీ రాజధానిగా ఎప్పటికీ అమరావతే ఉంటుందని బాబు వివరించారు.

అమరావతే రాజధాని..

మా రాజధాని అమరావతి అని ఏపీ ప్రజలంతా గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని బాబు అన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ వన్‌ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అంటూ బాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పాతికేళ్ల క్రితం తాను యువతకు ఇచ్చిన ఆయుధం ఐటీ అని అన్నారు.నన్ను ఏ కారణం లేకుండా, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందని చెప్పారు.

టొమాటొకి..పొటాటొకి తేడా తెలియదు..

ఈ స్టేజ్‌ మీద ఉన్న వాళ్లంతా కూడా జగన్‌ బాధితులే..ఎక్కువ రోజులు, తక్కువ రోజులే తప్ప ప్రతి ఒక్కరు స్టేషన్ గడప తొక్కిన వారే అని చంద్రబాబు పేర్కొన్నారు. టామాటాకి, పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. తిక్కలోడు తిరునాళ్లకెళితే ఎక్కాదిగా సరిపోయిందని జనగ్‌ తీరు అలా ఉంది.

ఇప్పటికి రాష్ట్రంలో ఏ జిల్లా రోడ్లైనా బాగున్నాయా అంటూ ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్‌ ను 70 శాతం నేనే పూర్తి చేశా. అంబోతు మంత్రి అరుస్తానే ఉంటాడు తప్ప డయాఫ్రమ్‌ ఎక్కడ ఉందో కూడా తెలీదని పేర్కొన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్ట్‌ ని గోదావరిల కలిపేశాడు. నమ్మి వచ్చిన అంబటి రాయున్ని నట్టేట ముంచేశాడు.

క్లీన్‌ బౌల్డ్‌ అవుతానని ముందుగానే..

గుంటూరు నీకే ఇస్తానన్నాడు, చివరికి వేరే వాళ్లకి ఇస్తానన్నాడు. ఆడకముందే క్లీన్‌ బౌల్డ్‌ అవుతాననుకొని ఫీల్డ్‌ విడిచి వెళ్లిపోయాడు. కొబ్బరి చిప్పల మంత్రి దేవాదాయశాఖను అప్పదిష్టపాలు చేసి పాడేశాడు. వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడా..? అంటూ ప్రశ్నించారు. సెంట్రల్‌ లో ఉండే మరో వ్యక్తి విజయవాడని కొనే పరిస్థితికొచ్చాడు.

బ్రాహ్మణులకు ఏం చేయలేదు అని పేర్కొన్నారు. నందిగామలో జగన్మోహన్ ,వాళ్ల తమ్ముడి అరచాకాలకు అంతులేకుండా పోయిందని పేర్కొన్నారు. జగ్గయ్య పేటలో మరొకడు ఉన్నాడు. ఆయన కొడుకు రాష్ట్రానికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. తిరువూరులో ఉన్న మరొకడు రక్షణ నిధి కాదు భక్షణ నిధి అంటూ బాబు పేర్కొన్నారు.

Also read: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి!

Advertisment
తాజా కథనాలు