Viral: పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి.. చంద్రబాబుపై దారుణమైన ట్రోలింగ్!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. తనవల్లే చాలామంది ఐటీ చదువుకుని విదేశాలకు వెళ్లడంతో తన ఓట్లన్నీ తగ్గిపోయాయంటూ చెప్పడం విమర్శలకు దారితీసింది. బాబుకు పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి.

New Update
Viral: పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి.. చంద్రబాబుపై దారుణమైన ట్రోలింగ్!

Chendrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెటిజన్లకు అడ్డంగా బుక్ అయ్యాడు. ఐటీ అభివృద్ధికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు చెప్పిందే చెప్పి చెప్పి సావమింగుతున్నాడంటూ ఆడేసుకుంటున్నారు. అంతేకాదు అప్పట్లో ఓ కోతలు రాయుడు ఉండేవాడు, పాచిపోయిన డైలాగులతో మా ప్రాణాలు తీసేవాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాబుకు పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తుండగా జనాలు నవ్వి నవ్వి చచ్చిపోతామంటున్నారు.

అసలేం జరిగిందంటే..
ఇటీవల ఒక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఒకప్పుడు ఐటీ చదువుకోవాలంటే అందరూ నవ్వారు. ఐటీ ఎక్కడుంది అని అనేవారు. నేను ప్రపంచమంతా తిరిగి చెప్పాను. ఐటీ వల్ల జీవితాల్లో మార్పు వస్తుందని. మీ పిల్లలకు ఎంత భూమి, డబ్బు ఇస్తారనేది ముఖ్యం కాదు. ఎంత చదివిస్తారనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. అప్పుడు చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ఉన్నత చదువులు చదివించారు. ఐటీ వల్ల ఉద్యోగాలు వచ్చాయి. వారంతా విదేశాలకు వెళ్లి సెటిలయ్యారు. ఒకరకంగా చాలామంది నన్ను విమర్శిస్తుంటారు. మీ వల్ల టీడీపీ ఓట్లన్నీ విదేశాలకు వెళ్లిపోయాయి అనేవారు. నేను నష్టపోయా. కానీ వారు బాగుపడ్డారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైలర్ అవుతుండగా జనాలు ఎవరికి నచ్చినట్లు వాళ్లు బాబును ఆడేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Samantha : సమంత ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు..!

విని విని మాకు ఓపిక నశించింది. నువ్వు మాత్రం చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెప్పి చెప్పి సావామింగుతున్నావ్. అదే అబద్ధం. నీకు ఓపిక సావడం లేదు. ఏమిరా సామి. ఏ పపంచo తిరిగావ్ నాయనా.
Nee vision IMG Bharat.

— Citizen 🇮🇳 (@citizen1525) March 13, 2024

Advertisment
తాజా కథనాలు