/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-2-jpg.webp)
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, అనుబంధ పిటిషన్ల పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ పిటిషన్ పై విచారణ చేశారు. అయితే.. విచారణ సందర్భంగా జడ్జి నాట్ బిఫోర్ మీ అని అన్నారు. హైకోర్టు సీజే సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపడతారని న్యాయమూర్తి వెల్లడించారు. సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరామని చంద్రబాబు లాయర్లు తెలిపారు. లాయర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేశారు న్యాయమూర్తి. ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం రిజిస్ట్రార్ కే వదిలేశారు.