BREAKING : కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..! ఇద్దరు కొత్త కమిషనర్లు బాధ్యతలు స్వీకరణ!

సార్వత్రిక ఎన్నికల పూర్తి షెడ్యూల్ నిరీక్షణకు నేటితో తెరపడే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది . ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు.

New Update
BREAKING : కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..! ఇద్దరు కొత్త కమిషనర్లు బాధ్యతలు స్వీకరణ!

Election Notification : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ECI) 2024 సార్వత్రిక ఎన్నికల(General Elections) తేదీలను కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు.


Also Read: రూ. 1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌ కింగ్‌ మార్టిన్ శాంటియాగో ఎవరు? ఆయన ED స్కానర్‌లో ఎందుకు ఉన్నాడు?

Advertisment
తాజా కథనాలు