Caste Census: మోదీకి ఝలక్‌.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ అన్నంత పనీ చేశారు. బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత నివేదికను విడుదల చేశారు. మొత్తం 13కోట్ల బీహార్‌ జనాభాలో 63శాతం ఓబీసీల శాతం ఉన్నట్టు తేలింది. బ్రాహ్మణులు 3.66 శాతంగా ఉన్నారు. కుల ఆధారిత జనాభా గణనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోన్న బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది. ఎందుకంటే మండల్‌కమిషన్‌ ప్రకారం బీసీల రిజర్వేషన్ వారి జనాభా ఆధారంగా ఇస్తున్నారు. 54శాతం బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలుతుండగా.. ఇప్పుడా సంఖ్య పెరిగితే రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. ఇది అగ్రవర్ణాల ఓట్లను ప్రభావితం చేస్తుంది.

New Update
Caste Census: మోదీకి ఝలక్‌.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?

Bihar caste census results out: కుల ఆధారిత జనాభా గణనపై పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసిన బీహార్‌ ప్రభుత్వం(Bihar Government) తన తొలి నివేదికను విడుదల చేసింది. గాంధీ జయంతి(అక్టోబర్‌ 2) సందర్భంగా కుల ఆధారిత నివేదికను రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన కుల ఆధారిత నివేదికను నితీశ్‌(Nitish Kumar) సర్కార్‌ ప్రజల ముందు ఉంచింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. బీహార్ ప్రభుత్వం వివాదాస్పద కుల ఆధారిత సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) 63 శాతం ఉన్నారని జనాభా లెక్కలు తేల్చాయి.


ఏ కులం శాతం ఎంతంటే
బీహార్ జాతి అధారిత్ గణన అని పిలుస్తోన్న ఈ జనాభా లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో అగ్రవర్ణాలు లేదా 'సవర్ణులు' 15.52 శాతం ఉన్నారు. జనాభాలో వెనుకబడిన తరగతులు 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీలు) 36 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. మండల్ వేవ్ నుంచి బీహార్ రాజకీయాలను శాసిస్తున్న తరగతలు వీరే కావడం విశేషం. అంటే ఉమ్మడిగా ఓబీసీలు 63శాతంగా ఉన్నారు. బీసీల సంఖ్య పెరిగిందని నితీశ్‌ సర్కార్‌ పదేపదే చెబుతూ వస్తోంది. క్యాస్ట్ సెన్‌సస్‌కు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా తెప్పించుకుంది. చేయాల్సిందంతా చేసింది. బీసీల సంఖ్య ఎక్కువని నివేదికలో తేలడం బీజేపీని ఇరుకున పెట్టేలా ఉంది. ఎందుకంటే మండల్‌ కమిషన్‌ ప్రకారం 54శాతం బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడా శాతం పెరిగితే రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. ఇది అగ్రవర్ణాలకు ఇష్టం లేని విషయం. బీజేపీకి ట్రెడిషనల్‌ ఓటు బ్యాంక్‌గా ఉన్న అగ్రవర్ణాలు ఎలా రియాక్ట్ అవుతుతారన్నదానిపై బీజేపీ ఓటు షేర్ ఆధారపడి ఉంటుంది.

publive-image బ్రిటీష్‌కాలం ముందు కులాల గణన

బ్రహ్మణుల శాతం తక్కువ:
బీజేపీకి వెన్నుదన్నుగా ఉండే బ్రహ్మణుల శాతం బీహార్‌లో చాలా తక్కువ అని తేలింది. భూమిహార్లు జనాభాలో 2.86 శాతం, బ్రాహ్మణులు 3.66 శాతంగా ఉన్నారు. కుర్మీలు - ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సామాజిక వర్గానికి చెందినవారు - జనాభాలో 2.87 శాతం ఉన్నారు. ముసహర్లు 3 శాతం, యాదవులు - ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సామాజిక వర్గం - జనాభాలో 14 శాతం ఉన్నారు. ఈ సర్వేపై న్యాయపరమైన అడ్డంకులు, బీజేపీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఈ నివేదిక దోహదపడుతుందని చెప్పారు. కుల ఆధారిత జనాభా గణన ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి గురించి సమాచారాన్ని అందిస్తుందని.. ఈ నివేదిక ఆధారంగా అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి తదుపరి చర్యలు తీసుకుంటామని నితీశ్ కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని నితీశ్‌ మిత్రపక్షం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వ్యాఖ్యలు చేశారు.

publive-image కులాల గణనకు వ్యతిరేకంగా బీజేపీ

మతాల పరంగా వివరాలు:
సర్వే ప్రకారం, హిందువుల జనాభా 81.99 శాతం, ముస్లింలు 17.70 శాతం, క్రైస్తవులు 0.05 శాతం, సిక్కులు 0.011 శాతం, బౌద్ధులు 0.0851 శాతం, జైన సమాజం 0.0096 శాతం, ఇతర మతాల జనాభా 0.1274 శాతం. బీహార్‌లో ఏ మతాన్ని అనుసరించని వారు 2146 మంది ఉన్నారని నివేదికలో పేర్కొంది.

publive-image 1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం సుప్రీంలో కేంద్రం వాదనలు

జనాభా గణన ఎప్పుడు నిర్వహించారు?
బ్రిటిష్ రాజ్ కాలంలో దేశంలో తొలిసారి జనాభా గణన చేశారు. జనాభా లెక్కల సమాచారం 1881 సంవత్సరంలో మొదటిసారిగా కులాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన నిర్వహించారు.కుల గణన డేటా చివరిగా 1931లో విడుదలైంది. అయితే, ఆ తర్వాత 1941లో కూడా కుల గణన నిర్వహించచారు కానీ దాని డేటాను విడుదల చేయలేదు. కుల గణనలో, షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభా గణన 1941 నుంచి నిర్వహిస్తున్నారు కానీ ఇతర కులాల ప్రత్యేక జనాభా గణనను పట్టించుకోలేదు.

పెరిగిన డిమాండ్‌:
దేశంలో జనాభా గణన జరిగినప్పుడల్లా కుల గణన చేయాలనే డిమాండ్ కూడా తలెత్తుతుంది. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా జనాభా గణన నిర్వహించినప్పుడు, కుల గణన కోసం డిమాండ్ చేశారు. అయితే అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీని వల్ల దేశ స్వరూపం చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని తర్వాత కూడా కుల గణన కోసం చాలాసార్లు డిమాండ్‌ వచ్చినా ప్రతిసారీ అదే వాదనతో తిరస్కరించారు. 2011 జనాభా లెక్కల సమయంలో కూడా రాజకీయ పార్టీలు మళ్లీ కుల గణన డిమాండ్‌ను లేవనెత్తగా, బీజేపీ నేత గోపీనాథ్ ముండే పార్లమెంటులో దానికి అనుకూలంగా ప్రకటన చేశారు. ఆ సంవత్సరం ప్రభుత్వం సామాజిక-ఆర్థిక జనాభా గణనను నిర్వహించింది, కానీ దాని డేటా సమర్పించలేదు. ఇక బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో కులాల సర్వే నిర్వహించి అగ్నికి ఆజ్యం పోసింది. అంతకుముందు మార్చి 16, 2021న, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా, స్వాతంత్ర్యం తర్వాత, SC-ST మినహా కులాల వారీ జనాభాను లెక్కించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

publive-image మండల్‌ కమిషన్‌ ప్రకారం 27శాతం బీసీలకు రిజర్వేషన్లు

ప్రతిపక్షాల డిమాండ్‌ ఏమిటి?
కుల గణన చేపట్టాలని పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జూలై 18, 2023న బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి భారత సమావేశంలో కూడా కుల గణనను డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలకు ఇది అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ కులం వెనుకబాటుతనానికి గురవుతుందో ఇది చెబుతుందని.. ఆర్థిక, సామాజిక, విద్యకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని అందిస్తుందని విపక్షాలు అభిప్రాపడ్డాయి. ప్రతిపక్షాలు కూడా ఎస్సీ-ఎస్టీలకు జనాభా గణన నిర్వహించినప్పుడు ఇతర కులాలకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేశాయి.

దేశంలో జనాభా గణనను ఎవరు నిర్వహించగలరు?
రాజ్యాంగం ప్రకారం జనాభా గణనను నిర్వహించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. 1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం, జనాభా గణన కోసం ఉద్యోగులను నియమించి సమాచారాన్ని సేకరించే అధికారం కేంద్రానికి ఉంటుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వే నిర్వహించవచ్చు. సర్వే కింద డేటాను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ లేదా కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

బీహార్‌లో కుల గణన టైమ్‌లైన్:
➼ 18 ఫిబ్రవరి 2019 - తారాగణం సర్వే కోసం ప్రతిపాదన బీహార్ అసెంబ్లీ ఆమోదించింది
➼ 27 ఫిబ్రవరి 2020 - బీహార్‌లో సర్వే కోసం ప్రతిపాదన
➼ 2 జూన్ 2022 - బీహార్ ప్రభుత్వ క్యాబినెట్ తారాగణం సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
➼ 7 జనవరి 2023 - బీహార్‌లో కులాల సర్వే వర్క్ ప్రారంభమైంది
➼ 4 మే 2023 - క్యాస్ట్ సర్వేపై పాట్నా హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది
➼ ఐదు రోజుల విచారణ తర్వాత, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది
➼ 1 ఆగస్టు 2023 - పాట్నా హైకోర్టు మధ్యంతర స్టే ఎత్తివేసింది.
➼ 19 ఆగస్టు 2023- కుల ఆధారిత సర్వే ఫలితాల ప్రచురణను నిషేధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది
➼ 25 ఆగస్టు 2023 – సర్వే పూర్తయిందని నితీష్ కుమార్ చెప్పారు
➼ 2 అక్టోబర్ 2023- డేటాను పబ్లిక్ చేశారు.


మోదీకి షాకే:
కులాల ఆధారంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా జనాభాను లెక్కించలేదు. ఇప్పుడా రికార్డును నితీశ్‌ ప్రభుత్వం బద్దలు కొట్టింది. నితీశ్‌ తరహాలోనే కులాల ఆధారంగా జనాభగణన చేయాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ కూడా దీనికి మద్దతుగా ఉండగా.. ఇటు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సైతం కుల గణనకు సపోర్ట్ చేస్తున్నారు. బీహార్‌ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధంగా జనాభాను లెక్కిస్తే బీజేపీకి మైనస్‌ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీసీ కులాల సంఖ్య ఆధారంగానే ప్రస్తుతం వారికి 27శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. వారి సంఖ్య పెరిగిందనే తేలితే రిజర్వేషన్‌ శాతం పెంచాల్సి ఉంటుంది. దీనికి బీజేపీ అంగీకరించకుంటే బీసీల ఓట్లు పోతాయి.. ఒప్పుకుంటే అగ్రవర్ణాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వ్యవహారంలో బీజేపీ మొదటి నుంచి ఏమీ పట్టనట్టు ఉంటుంది.

రాహుల్‌ గాంధీ ఏం అన్నారంటే:
బీహార్‌లో కులగణనపై కాంగ్రెస్‌తో పాటు INDIA కూటమి పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. బీహార్‌ కులగణనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. బీహార్‌లో జరిగిన కుల గణనలో ఓబీసీ+ ఎస్సీ+ ఎస్టీలు 84 శాతం ఉన్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వ 90 మంది కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు, వారు భారత బడ్జెట్లో కేవలం 3శాతం మాత్రమే నిర్వహిస్తున్నారు! అందువల్ల భారతదేశ కుల గణాంకాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనాభా ఎంత ఎక్కువైతే హక్కులు అంత ఎక్కువగా ఉంటాయి – ఇదీ మన ప్రతిజ్ఞ.' అని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.


ALSO READ: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!

Advertisment
తాజా కథనాలు