Chikoti praveen:వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానంటున్న క్యాసినో కింగ్ చికోటీ! క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వారం రోజులుగా ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే బీజేపీలోని కొంతమంది నేతలను కలిసి ఆయన పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కారు తనను వేధింపులకు గురిచేస్తోందని, అక్రమ కేసులు పెట్టి హింసిస్తోందని అందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు చికోటీ వెల్లడించారు... By P. Sonika Chandra 12 Aug 2023 in తెలంగాణ Uncategorized New Update షేర్ చేయండి Chikoti praveen: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వారం రోజులుగా ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే బీజేపీలోని కొంతమంది నేతలను కలిసి ఆయన పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కారు తనను వేధింపులకు గురిచేస్తోందని, అక్రమ కేసులు పెట్టి హింసిస్తోందని అందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు చికోటీ వెల్లడించారు. Your browser does not support the video tag. తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయనున్నట్లు చీకోటి తెలిపారు. మరో 15 రోజుల్లో ఒక హాట్ న్యూస్ ని.. గుడ్ న్యూస్ ని చెప్తానని అన్నారు చీకోటి. అయితే రాజకీయాల్లో అడుగుపెడుతున్న ఆయన బీజేపీలో చేరి తెలంగాణ నుంచి పోటీ చేస్తానని ఆ మేరకు వారం రోజుల నుంచి నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. చికోటీ పై వరుసగా కేసులు.. క్యాసినో గేమ్స్ నిర్వహించడంతో పాపులర్ అయిన చికోటి ప్రవీణ్ కుమార్.. ఈ మధ్యే బోనాల పండుగ రోజున తన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ తో లాల్ దర్వాజ అమ్మోరు ఆలయం దగ్గర హల్ చల్ చేయడంతో మరో కేసులో చిక్కుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ తో బయటకు వచ్చారు. అంతకు ముందు గ్యాబ్లింగ్, అదే విధంగా చట్టవిరుద్ధంగా వన్యప్రాణులను తన ఫామ్ హౌజ్ పెట్టడం లాంటి కేసులు చికోటీ పై ఉన్నాయి. అయితే క్యాసినో కేసులో ఈడీ విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. రాజకీయాలపై ఆసక్తి.. గత కొంతకాలంగా చికోటీ ప్రవీణ్ కుమార్ పాలిటిక్స్ పై తెగ ఆసక్తికనబర్చుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక హిందుత్వమనేది తన బ్లడ్ లోనే ఉందని, ఒక వేళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం తప్పకుండా తాను బీజేపీ నుంచే అని ఆయన గతంలో కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3 వ తేదీన చికోటి ప్రవీణ్ ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణ, జయసుధను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే చాలా కేసుల్లో ఇరుక్కున్న చికోటీ వాటి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి