జూబ్లీహిల్స్‌లో ఇల్లు కబ్జాకు సినీ నటి యత్నం.. షాక్ ఇచ్చిన పోలీసులు

సినీ నటి స్వాతి దీక్షిత్‌ రూ.30 కోట్ల విలువైన ఇళ్లు కబ్జా కేసులో ఇరుక్కుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 58, ప్లాట్‌ నంబరు 1141 ఇంటిని గతంలో లీజుకు తీసుకున్న స్వాతి ఇప్పుడు తనదేనంటూ దౌర్జన్యం చేస్తుందని యజమానురాలు మాధురి ఫిర్యాదు చేసింది. స్వాతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
జూబ్లీహిల్స్‌లో ఇల్లు కబ్జాకు సినీ నటి యత్నం.. షాక్ ఇచ్చిన పోలీసులు

సినీ నటి స్వాతి దీక్షిత్‌ ఓ ప్రాపర్టీకీ సంబంధించిన విషయంలో చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో కోట్లు విలువచేసే ఇంటిని గతంలో లీజ్ కు తీసుకున్న దీక్షిత్.. ఇప్పుడు ఆ ఇళ్లు తనదేనంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ గొడవ మరింత పెరిగిపోయింది. దీంతో స్వాతి దీక్షిత్ రెచ్చిపోయి ఇంటిపై దాడిచేయగా నటిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జూబ్లీహిల్స్‌ ఎస్సై శ్రీరాంగోపి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 58, ప్లాట్‌ నంబరు 1141 యజమానురాలు మాధురి విదేశాల్లో ఉంటున్నారు. అయితే రూ.30 కోట్ల విలువైన ఈ ఇంటిని అమ్మకానికి పెట్టే వ్యవహారంలో స్వాతి దీక్షిత్‌ ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య డబ్బుల విషయంలో విభేదాలు మొదలవగా ఈ కేసు వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై కోపంతో రగిలిపోతున్న స్వాతి సోమవారం మధ్యాహ్నం కారుతో ఇంటి ముందు గేటును ధ్వంసం చేసి తన 20 మంది సన్నిహితులతో ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న కాపలాదారు కుటుంబ సభ్యులైన శోభ ఆమె భర్త అశోక్‌ను దుర్భాషలాడి, ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో A1గా సాయి ప్రశాంత్‌, A2 స్వాతి దీక్షిత్, A3గా రణ్‌వీర్ సింగ్ - A4గా రామ్‌కుమార్‌లపై IPC ఐపీసీ 7, 148, 447, 427, 504, 506 R/W 149 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరాంగోపి తెలిపారు.

Also read : బాత్‌రూమ్ వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడి దారుణం.. ఫొటోలు తీసి

ఇదిలావుంటే.. 2010లో వచ్చిన 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా ఇండస్ట్రీకి పరిచమైంది. ఆ తర్వాత 2012లో బెంగాలీలో 'తోర్ నామ్' సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తెలుగు చిత్రం కొత్త బంగారు లోకంకు రీమేక్ గా నిర్మించారు. ఇక స్వాతి దీక్షిత్ రియాల్టీ షో 'బిగ్ బాస్'నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ ప్రేక్షకులను అలరించింది.

Advertisment
తాజా కథనాలు