Car accident: వంతెన పై నుంచి కదులుతున్న రైలు పై పడ్డ కారు! వంతెన పై అదుపుతప్పిన ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టి కింద పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు మీద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు.ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్గడ్ లో జరిగింది. By Bhavana 08 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి వంతెన మీద నుంచి అదుపు తప్పిన ఓ కారు ట్రాక్ పై వెళ్తున్న గూడ్స్ రైలు మీద పడిపోయింది. రైలును కారు తాకడం వల్ల కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మంగళవారం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో ముంబయి నుంచి నేరల్ వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో కర్జాత్ ప్రాంతంలోని కిర్వాలీ బ్రిడ్జి పైకి రాగానే కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. అనంతరం 30 అడుగుల పై నుంచి కిందకి పడిపోయింది. Also read: అతని మరణం నాకు తీరని లోటు..యాంకర్ ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్! ఆ సమయంలో కర్జాత్ నుంచి పన్వేల్ కు వెళ్తున్న గూడ్స్ వంతెన కింద ట్రాక్ పై వెళ్తుంది. గూడ్స్ మీద కారు పడడంతో దాని బోగీలు కొన్ని విడిపోయాయి. ప్రమాదం జరగడంతో రైలు ఆగిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కారును పైకి తీసి...కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను కూడా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..చికిత్స పొందుతూ ముగ్గురు వ్యక్తులు మరణించారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి పంపించారు. మృతులు అంతా ఒకే కుంటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. Also read: అమిత్ షాకి తృటిలో తప్పిన ప్రమాదం! #car-accident #maharashtra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి