Gujarath: గుజరాత్‌లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి

గుజరాత్‌లోని సూరత్‌ నుంచి సపుతారాకు వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఈ బస్సులో మొత్తం 65 మంది ప్రయాణికులున్నారు.

New Update
Gujarath: గుజరాత్‌లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి

Bus Accident: గుజరాత్‌లోని హైవేపై వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది. రక్షణ గోడ మీద నుంచి లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సపుతర కొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.

హైవే మీద వెళుతున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్ని్తుండగా ప్రమాదం సంభవించింది. వంపు దగ్గర అదుపు తప్పి రక్షణ గోడకు ఢీకొట్టుకుని లోయలోకి పడిపోయింది. ఏకంగా బోల్తా అయిందని పోలీసులు చెప్పారు.

Also Read:PM Modi: ముగిసిన ప్రధాని రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు పయనం

Advertisment
తాజా కథనాలు