TelanganaElection2023 : నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా...శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!!

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసున్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు.

New Update
TelanganaElection2023 : నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా...శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!!

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసునని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. మాయమాటలు చెప్పి మసిపూసిమారడికాయ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని..కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపంలో సరైన సమాధానం చెబుతారని శంకర్ నాయక్ అన్నారు. ఇప్పటికైనా మాయ మాటలు మాని...బుద్ధిగా ప్రచారం చేసుకోమని సూచించారు. రైతు భీమా, రైతు బంధు, సాగునీరు, తాగునీరు ఇచ్చాం..కాంగ్రెస్ పార్టీ ఏం ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో 25వేల భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలబోతుందన్నారు. శంకర్ నాయక్ పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి:  గద్దర్ బిడ్డపై 110 శాతం గెలుస్తా.. లాస్య చెప్పిన లాజిక్ ఇదే!

Advertisment
తాజా కథనాలు