Telangana BJP: కాషాయ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు.. బీజేపీలో మళ్లీ చేరికల జోష్!

మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్ కాషాయ గూటికి చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
Telangana BJP: కాషాయ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు.. బీజేపీలో మళ్లీ చేరికల జోష్!

మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్ కాషాయ గూటికి చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో కీలక నేత ఈటల రాజేందర్ కృష్ణ యాదవ్ కు పార్టీ కుండువా కప్పారు. సిర్పూర్ కాగజ్ నగర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ కూడా ఈ రోజు పార్టీలో చేరగా.. డీకే అరుణ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ మీద గెలిచి సంచలనం సృష్టించిన చిత్తరంజన్ దాస్ బీజేపీలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పని గట్టుకొని కొంత మంది బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. సొంత ఎజెండాతో పత్రికలు రాతలు రాయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఖమ్మంలో సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం బహిరంగ సభలో 11మంది నాయకులు చేరినట్లు చెప్పారు. ఇంకా పెద్ద మొత్తంలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీరంతా ఈరోజు కిషన్ రెడ్డిని కలుస్తారు.

*this is an updating story

Advertisment
తాజా కథనాలు