/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-KCR-Tweet-on-revanth-reddy-1-jpg.webp)
నల్లగొండ జిల్లాలో ఈ రోజు జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. ఈ ప్రమాదాలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…
— BRS Party (@BRSparty) December 25, 2023
ఈ మేరకు కొద్ది సేపటి క్రితం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ రోజు తొలిసారిగా ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..