Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ.. ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన సింగరేణి ఎన్నికల్లో కేబీజీకేఎస్ సంఘం పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికుల గొంతుకైనా బొగ్గు గని కార్మిక సంఘం గుర్తు బాణం గుర్తుపై ఓట్లు వేయాలని ఆత్మసాక్షిగా వ్యవహరించాలని కార్మికులకు కవిత పిలుపునిచ్చారు By Nikhil 22 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఈ నెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో (Singareni Elections) బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓట్లేసి టీబీజీకేఎస్ను (TBGKS) గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ మేరకు కవిత ప్రకటన విడుదల చేశారు. టీజీబీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. సింగరేణి హక్కులను సాధించింది ఈ సంస్థేనని అన్నారు కవిత. కేసీఆర్ సింగరేణిని కాపాడారన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్ ఇదిలా ఉంటే.. సింగరేణి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ అనుబంధ సంఘమైన TBGKSకు ముగ్గురు అగ్రనేతలు రాజీనామా చేశారు. సంఘం గౌరవాధ్యక్షురాలు కవితకు ఉమ్మడిగా లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో బి. వెంకట్రావ్-యూనియన్ అధ్యక్షుడు, మిర్యాల రాజిరెడ్డి-ప్రధాన కార్యదర్శి, కెంగర్ల మల్లయ్య-వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు అనూహ్యంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. #singareni-elections #brs-mlc-kalvakuntla-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి