Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. హరీష్ రావు ఫైర్

TG: రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు హరీష్ రావు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు.

Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. హరీష్ రావు ఫైర్
New Update

Harish Rao: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు.

"రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు.

రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం.

ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.

#harish-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe