MLA KTR: ఈసారైనా ఆ ప్రాజెక్ట్ తీసుకురా.. బండి సంజయ్కు కేటీఆర్ లేఖ TG: కేంద్ర మంత్రి బండి సంజయ్కు BRS నేత కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకొని రావాలని కోరారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందన్నారు. By V.J Reddy 11 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLA KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు (Bandi Sanjay) మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకురండి అని కోరారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని అన్నారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తెప్పించండి అని కోరారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల సంక్షోభంలో చేనేత రంగం ఉందని అన్నారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని సూచించారు. Also Read: ఎందుకు ఓడారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ! #mla-ktr #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి