Telangana: అతి త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని, కవిత బెయిల్ కు, బీజపీకి ఏం సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమని, ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా? కవిత బెయిల్ పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: బీజేపీలో ఆప్ విలీనం.. సిసోడియా బెయిల్పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు.
Translate this News: