ఇటుకల కోసం క్యూ..
పూర్తిగా చదవండి..పండగ వస్తున్నాయంటే చాలు మహిళలు హడావుడి అంతా ఇంతా ఉండదు. కానీ.. ఆ ఊరి మహిళలు మాత్రం ఇటుకల పండగ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పండగ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సంప్రదాయ పండగల్లో ఇటుకల పండగ ఒకటి. ప్రస్తుతం ఈ పండగ పిఠాపురంలో సందడి చేసింది. ఈ వింత ఆచారంతో దూరప్రాంతాల నుంచి మహా ప్రసాదంగా ఇటుకలను తీసుకువెళ్లేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. విజయవాడ, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావటం విశేషం.
భక్తులకు మంత్రోపదేశం
కాకినాడ జిల్లా పిఠాపురం గోర్స రోడ్డులో శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కొలువై ఉంది. ప్రధానంగా సూఫీమాత సిద్ధాంతాలు ఆధారంగా ఇక్కడ ఆశ్రమాన్ని శతాబ్దాల కిందటే నెలకొల్పారు. భక్తులు పెద్ద ఎత్తున నిత్యం ఎక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం డాక్టర్ ఉమర్ అలీషా పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పీఠంలో నిత్యం పూజలు జరుగుతాయి. సమానత్వం మానవాతీత దేవాలయంగా ఇక్కడ ఉమర్ ఆలీషా పీఠాన్ని కొలుస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఇక్కడ మహాసభలు జరుగుతున్నాయి. అలాగే ప్రతీ గురువారం స్వామీజీ భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు. దీనికోసం ఎన్నో ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. వీరంతా ఉమర్ అలీషా ఆధ్యాత్మిక పీఠంలో సంఘ సభ్యులుగా కూడా ఉంటారు.
ఏళ్లుగా వస్తున్న ఆచారం
ఇక్కడ ఆధ్యాత్మిక బోధనలు జరపడం అనేది ఎన్నో ఏళ్లుగా శతాబ్ద కాలం నుండి వస్తున్న ఆచారం. గోర్స రోడ్డులో గల పాత ఆశ్రమం 5వ పీఠాధిపతి నుండి కొంత మంది పీఠాధిపతులు సమాధులు రైల్వే ట్రాక్ పక్కనే గుడిగా ఏర్పాటు చేసి ఉంటుంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఉమర్ ఆలీషా పీఠంలో సమాధులు చుట్టూ ఉన్న గోడను రైల్వే పనులు అడ్డుగాను, రైతులకు మార్గానికి ఆటంకంగా ఉండటంతో దారి చూపేందుకు కూల్చెందుకు పనులు మొదలుపెట్టారు. దీనికి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూజగదిలో ఇంటి పునాది శంకుస్థాపన రాళ్ళు
అయితే.. ఎంతో పురాతన చరిత్ర కలిగిన గోడను ఒక్కసారిగా కూల్చేసరికి భక్తులు ఆ ఇటుకలను తీసుకువెళ్లేందుకు ఎగబడ్డారు. ఈ ఆశ్రమానికి ఎంతో చరిత్ర ఉంది. పైగా ఈ ఆశ్రమంలో ఇటుకలకు ఎంతో బలం ఉందనే నమ్మకంతో వాటిని సంచులలో మూటలలో కట్టుకుని భక్తులు వారి యొక్క ఇళ్లకు తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయశమైంది. స్థానికులు కాకుండా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, విశాఖ, విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సంచుల్లో ఇటుకలు వేసుకుని మరి భక్తి భావంతో ప్రసాదంగా తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు పట్టుకెళ్తున్నారని అడిగిన వారికి ఇక్కడ శతాబ్ది కాలం నుండి పీఠాధిపతులు మటాడిన ప్రాంతంలో ప్రతీ ఇసుక రేణువు మాకు దైవంతో సమానం అంటూ ఇంటి పునాది శంకుస్థాపన రాళ్ళుగాను, పూజగదిలోను పెట్టుకుని పూజిస్తామని భక్తులు చెపుతున్నారు. అక్కడ ఇటుకలు పట్టుకెళ్ళేందుకు బ్యాగులు ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చినవారికి భోజనం సౌకర్యం కూడా ఆ పీఠం యాజమాన్యం ఏర్పాటు చేయడం విశేషం.
[vuukle]