BREAKING: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

AP Politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని లోకేష్ (Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభంలోనే టీడీపీకి (TDP) షాక్ తగిలింది. టీడీపీకి కీలక నేత రాజీనామా చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSRCP) పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి చేరారు.publive-image

చలమారెడ్డితో పాటు సీఎం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ స్ధానిక నాయకులు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్‌ రెడ్డి, వి.శంకర్‌. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్!

#tdp-shock #jagan #ap-news #ysrcp #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe