Brahmamudi Serial: ఇంట్లో రచ్చ చేసిన ధాన్యలక్ష్మీ, అనామిక.. అత్తా, కోడళ్ళకు కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!

కళ్యాణ్ అప్పును కలవడం జీర్ణించుకోలేకపోతున్న అనామిక, ధాన్యలక్ష్మీ ఇంటికి వచ్చి కావ్య పై నిందలు వేయడం మొదలు పెడతారు. కళ్యాణ్ ఇలా మారడానికి కావ్యే కారణమని దూషిస్తారు. దీంతో కళ్యాణ్ వదిన తప్పేమీ లేదని అత్తా, కోడళ్ళకు గడ్డి పెడతాడు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: ఇంట్లో రచ్చ చేసిన ధాన్యలక్ష్మీ, అనామిక.. అత్తా, కోడళ్ళకు కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!

Brahmamudi Serial: ధాన్యలక్ష్మి, అనామిక కనకం ఇంటికి వచ్చి రచ్చచేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు ఇంటికి రాగానే.. కోపంతో ఉన్న కనకం.. కళ్యాణ్ ను ఇంకోసారి ఇంటికి రావద్దని హెచ్చరిస్తుంది. దీంతో అనుమానం వచ్చిన కళ్యాణ్ ఇంటికి వచ్చిన ఎవరైనా గొడవ చేశారా..? మా గురించి తప్పుగా మాట్లాడారా అని అడుగుతాడు.publive-image

కనకం, కృష్ణమూర్తి ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అప్పు నీ భార్య అనామిక రచ్చ చేసి ఉంటుంది అని అంటుంది. అనామిక మాత్రమే కాదు ధాన్యలక్ష్మీ కూడా వచ్చింది అని జరిగిన అవమానం గురించి కళ్యాణ్, అప్పుతో చెప్తుంది. దీంతో కళ్యాణ్ కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ వెళ్లి ఏం చేస్తాడో.. అక్కడ కావ్యను ఏమంటారో అని భయపడతారు కనకం, అప్పు.

publive-image

కొడుకు కళ్యాణ్ అనామికను కలిసాడని తట్టుకోలేకపోతున్న ధాన్యలక్ష్మీ ఇంటికి వెళ్లి కావ్యతో పంచాయితీ పెట్టుకుంటుంది. కావ్య వల్లే తన కొడుకు ఇలా మారిపోయాడని ఆమెను నిందిస్తుంది. తన చెల్లిని నానా మాటలు అనడం ఓర్చుకోలేకపోయిన స్వప్న.. ధాన్యలక్ష్మిని కడిగిపారేస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తుంది.

publive-image
ఇంతలో ఇంటికి వచ్చిన కళ్యాణ్.. నిజానిజాలు తెలుసుకోకుండా పంచాయితీ పెట్టారని ధాన్యలక్ష్మి, అనామికలకు గడ్డి పెడతాడు. ఇందులో వదిన కావ్య తప్పేమీ లేదు.. తాను ఎప్పుడూ తన మంచి కోసం మాత్రమే ఆలోచించిందని కావ్యకు సపోర్ట్ గా మాట్లాడతాడు.

publive-image
ధాన్యలక్ష్మి, అనామిక ప్రవర్తనతో కోపంగా రగిలిపోతున్న కళ్యాణ్ అత్తా, కోడళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఎప్పుడు నీ నగలు, అలంకారం తప్పా ఎప్పుడైనా నీ కొడుకు ఏం కావాలని పట్టించుకున్నావా..? కానీ వదిన పట్టించుకుంది. చిన్నప్పటి నుంచు నన్ను పెంచింది నువ్వు కాదు అన్నయ్య, పెద్దమ్మ, పెదనాన్న. ఇప్పుడు వచ్చి ఏదో జరిగిపోనట్లు రచ్చ చేస్తున్నావు అన్నట్లుగా..  ధాన్యలక్ష్మికి గడ్డి పెడతాడు కళ్యాణ్. భార్య అనామికకు కూడా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళమని చెప్తాడు. publive-image
ఆ తర్వాత కావ్యకు సారీ చెప్పి .. కళ్యాణ్ వెళ్లిపోతుండగా.. అతన్ని ఆపుతుంది కావ్య. ఎందుకు మా వాళ్లకు మాట వచ్చే పని చేస్తున్నారు కవిగారు . ఈరోజు మీ అమ్మ, భార్య మా కుటుంబాన్ని నిందించారు అని అంటుంది కావ్య. దీంతో అప్పుతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది.. దాన్ని అపార్థం చేసుకోవడం వాళ్ళ తప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Jr.NTR- WAR 2: కేవలం 60 రోజుల్లో ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్.. హృతిక్ రోషన్ తో కలిసి అన్ని రోజులు మాత్రమే

Advertisment
తాజా కథనాలు