Brahmamudi: అపర్ణకు షాక్..! అసలు నిజం బయటపెట్టిన మాయ.. రుద్రాణికి గుండెపోటు..! బిడ్డకు తల్లైన కావ్య..!

ఇంట్లో అందరి ముందు అసలు నిజం బయటపెడుతుంది మాయ. బిడ్డతో సుభాష్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. దాంతో సుభాష్, అపర్ణ మధ్య మనస్పర్థలు తొలగిపోయి, ఇంట్లో అందరు సంతోషపడతారు. మరో వైపు బిడ్డను తామే పెంచుకుంటానని షాకిస్తారు రాజ్, కావ్య. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi: అపర్ణకు షాక్..! అసలు నిజం బయటపెట్టిన మాయ.. రుద్రాణికి గుండెపోటు..! బిడ్డకు తల్లైన కావ్య..!

Brahmamudi: మావయ్య సుభాష్ ను నిర్దోషిగా నిరూపించాలనుకుంటుంది కావ్య. దాని కోసం భర్త రాజ్ సహాయంతో మాయను వెతకడానికి వెళ్తుంది. కావ్య, రాజ్ కారులో వెళ్తుండగా.. రౌడీల నుంచి తప్పించుకున్న మాయ వాళ్ళకు ఎదురుపడుతుంది. దీంతో కావ్య, రాజ్ మాయను కాపాడి ఇంటికి తీసుకొని వెళ్తారు.

publive-image మాయను ఇంటికి తీసుకొచ్చిన కావ్య.. ఇప్పుడు అసలు నిజమేంటో అందరి ముందు బయటపెట్టమని మాయను హెచ్చరిస్తుంది. ఇంతలో రుద్రాణి మళ్ళీ కొంత నాటకానికి తెర తీసావా..? అంటూ కావ్య పై సెటైర్లు వేస్తుంది. ఒకసారి దొంగ మాయను తీసుకొచ్చి మా వదినకు హార్ట్ ఎటాక్ తెచ్చావు. ఇప్పుడు ఈ మాయను తీసుకొచ్చి ఎవరకి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తావు అని వెటకారంగా మాట్లాడుతుంది.

publive-imageఇక రుద్రాణి మాటలకు విసిగిపోయిన కావ్య ఆమెకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. నీకే నెక్స్ట్ గుండెపోటు వచ్చేది మీకే అని ఇండైరెక్ట్ గా రుద్రాణిని భయపెడుతుంది. మరో వైపు స్వప్న కూడా రుద్రానిని చివాట్లు పెడుతుంది. దీంతో రుద్రాణి సైలెంట్ గా ఉండిపోతుంది.

publive-image
ఆ తర్వాత మాయ అసలు నిజం బయటపెడుతుంది. సుభాష్ తనకు సంబంధం ఉందనేది నిజమే. కానీ ఆ బిడ్డకు సుభాష్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆ బిడ్డ తండ్రి కాదు అని అందరికి షాకిస్తుంది. దీంతో ఇందిరాదేవి మరి ఎందుకు ఇలా చేశావు అని మాయను నిలదీస్తుంది. కొంతమంది నన్ను భయపెట్టి ఇందంతా చేయించారు అని చెప్తుంది.

publive-image
ఇక తప్పు ఒప్పుకున్న మాయ క్షమించమని అపర్ణ కాళ్ళ పై పడుతుంది. కానీ అపర్ణ దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ మాయను పట్టుకోవడానికి కావ్య పడిన కష్టం గురించి వివరిస్తాడు. నాన్న మోసపోయారని ముందుగా కావ్యనే గుర్తించింది. బిడ్డను వదిలేసి నెలకు లక్షలు లక్షలు డబ్బులు తీసుకునే మాయ పై అనుమానంతో ఆమె నిజస్వరూపం బయట పెట్టాలనుకుంది అని కావ్య గురించి గొప్పగా చెప్తాడు.

publive-image
సుభాష్ నిర్దోషి అని తేలడంతో ఇంట్లో అందరు సంతోషిస్తారు. కానీ రుద్రాణి మాత్రం మరో కొత్త పంచాయతీ మొదలుపెడుతుంది. అన్నయ్యకు, ఆ బిడ్డకు ఏ సంబంధం లేకపోతే మరి ఇప్పుడు ఆ బిడ్డ సంగతేటి అని అంటుంది. దీంతో ఇంట్లో అందరు ఆలోచనలో పడతారు. మరో వైపు రుద్రాణి బిడ్డను అనాథఆశ్రమంలో వదిలేయమని చెప్తుంది. కానీ కావ్య, రాజ్ మాత్రం ఆ బిడ్డను తామే పెంచుకుంటామని చెబుతారు. ఇక కావ్య, రాజ్ నిర్ణయానికి ఇందిరాదేవి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Bigg Boss: ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు