Botsa Satyanarayana: విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని..జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అమ్మఒడిలో స్కాం జరిగిందన్నారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని . మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. కాగా, ఈ ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు.
పూర్తిగా చదవండి..బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!
విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించడంపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని..ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స.
Translate this News: