Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటి?: మంత్రి బొత్స

సీఎం జగన్ పై దాడిని ఖండించారు మంత్రి బొత్స. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గాజువాక సభలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు.

TDP: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం!
New Update

Botsa Satyanarayana on Vizag Steel Plant: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ దాడిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై దాడిని ఆయన ఖండించారు. చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ ఈ దాడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకోని మాట్లాడాలన్నారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించారు.

Also Read: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు . చంద్రబాబు గాజువాక సభలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా ఎందకు మాట్లాడలేదని విమర్శించారు. విశాఖలో ఎంపీగా పోటీ చేస్తుంది ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారని మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ పై స్పందించలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు. రేపు గెలిచిన వెంటనే తామ స్టీల్ ప్లాంట్ పై ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధమన్నారు.

#botsa-satyanarayana #ap-ex-cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe