Akshay Kumar : కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో.. ఇది మూడోసారి?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల అక్షయ్ కొద్దిగా అస్వస్థతకు లోనైయ్యారట. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా గతంలోనూ ఆయన రెండుసార్లు కరోనా బారిన పడటం గమనార్హం.

New Update
Akshay Kumar : కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో.. ఇది మూడోసారి?

Bollywood Actor Akshay Kumar Tested Corona Positive : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతుంది. కొద్దిగా అస్వస్థతకు లోనైన అక్షయ్‌ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి ఆయన బయటికి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

అంతేకాదు తన కొత్త సినిమా 'సర్ఫిరా' ప్రమోషన్స్ కు సైతం అక్షయ్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.అక్షయ్‌ కుమార్ కరోనా రావడం ఇది మూడో సారి. గతంలో రెండుసార్లు ఆయన కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడాడు. ఆ మహమ్మారిపై విజయం సాధించినప్పటికీ కోవిడ్‌ లక్షణాలు మాత్రం తనను వెంటాడుతున్నాయని గతంలో వెల్లడించాడు.

Also Read : అమితాబ్ కాళ్ళు మొక్కిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో!

మునుపటిలా ధృడంగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూర్య నటించిన ‘సూరారైపోట్రు’ (ఆకాశం నీహద్దురా) రీమేక్‌గా ఇది రూపొందింది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సుధా కొంగర ఈ మూవీని తెరకెక్కించారు.

Advertisment
తాజా కథనాలు