ఏ క్షణంలోనైనా బీజేపీ తొలి జాబితా.... ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే....!

అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఏక్షణమైనా తెలంగాణ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేయనున్నట్టు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. తాజాగా ఏయే నియోజక వర్గాల నుంచి ఎవరెవరికి

New Update
Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?

తెలంగాణలో ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఏక్షణమైనా తెలంగాణ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేయనున్నట్టు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో ఏయే నియోజక వర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే అంతా అంచనాలు వేస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం .... బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట్ నియోజక వర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఇక రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్ ఈ సారి వేముల వాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

ఇక పార్టీ ఫైర్ బ్రాండ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూర్ నుంచి పోటీలో వుంటారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మళ్లీ హూజూరాబాద్ లో పోటీ చేస్తారని తెలుస్తోంది. రఘునందన్ రావు దుబ్బాక, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తారు. ఎంపీ లక్ష్మణ్ డా.లక్షణ్ ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో వుంటారు.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల్, విజయశాంతి మెదక్ లేదా మల్కాజ్ గిరి, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్, సోయంబాబురావు బోథ్, మహేశ్వర్ రెడ్డి నిర్మల్, పటాన్ చెరు నందీశ్వర్ గౌడ్, కుద్బుల్లా పూర్ శ్రీశైలం గౌడ్, రామారావు పటేల్ ముథోల్, ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్, రావు పద్మ- వరంగల్ ఈస్ట్, ఎర్రబెల్లి ప్రదీప్ రావును పరకాలలో పోటీకి దించే అవకాశం ఉంది.

ఇబ్రహింపట్నం- బూర నర్సయ్య గౌడ్, ధర్మపురి-వివేక్ , రాజేంద్రనగర్-తోకల శ్రీనివాస గౌడ్, గోషామహల్-విక్రమ్ గౌడ్, ఎల్బీ నగర్-సామ రంగారెడ్డి. ఉప్పల్- ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి, తాండూర్-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చొప్పదండి- బొడిగే శోభ, ఆందోల్-బాబు మోహన్, మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్, సనత్ నగర్-మర్రి శశిదర్ రెడ్డి, సికింద్రాబాద్-జయసుధ, గోషామహల్ నుంచి రాజాసింగ్ లేదా విక్రమ్ గౌడ్ బరిలో నిలిచే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు