తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన దరువు ఎల్లన్న రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం బీజేపీలో చేరి క్రియాశీలకంగా పని చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో యాక్టీవ్ గా పాల్గొన్నారు. తన పాటలతో కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేశారు. మానకొండూరు నుంచి ఆయన బీజేపీ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఆరేపల్లి మోహన్ కు బీజేపీ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ లో చేరారు.
పూర్తిగా చదవండి..BRS Party: బీజేపీకి మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన దరువు ఎల్లన్న
మనకొండూరు టికెట్ దక్కకపోవడంతో బీజేపీపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఈ రోజు బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
Translate this News: