పూర్తిగా చదవండి..
కిడ్నాప్ కలకలకం
జనగామ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్కు గురయ్యారు. హైదరాబాద్లోని ఆల్వాల్లో కొంతమంది అగంతకులు ఆయనను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. జనగామ జిల్లా దుబ్బకుంటపల్లికి చెందిన తిరుపతి రెడ్డి నగరంలోని కుషాయిగూడలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆల్వార్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన ఆయనను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రత్యర్ధులే నిందితులు?
తన భర్త కిడ్నాప్కు గురయ్యారనే తిరుపతిరెడ్డి భార్య సుజాత ఆల్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ ల్యాండ్ విషయంలో ఉన్న ప్రత్యర్థులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమకు ఆల్వాల్లోని పాకాలకుంటలో 5,929 గజాల స్థలం ఉందని.. ఈ భూమి విషయంలో కొంతమందితో వివాదం నడుస్తోందని ఆమె తెలిపింది. దీంతో ప్రత్యర్థులే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తంచేస్తోంది.
టికెట్ కోసం ప్రయత్నాలు?
గతంలోనూ తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదమే కిడ్నాప్కు కారణమై ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిరుపతిరెడ్డి.. రాష్ట్ర స్థాయిలో కీలక స్థానంలో ఉండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో జనగామ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కిడ్నాప్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. త్వరగా ఆయన ఆచూకీ కనిపెట్టాలని బీజేపీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
[vuukle]