Rajasthan CM: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పదిరోజులు అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఐదు రోజులు కావస్తోంది. బీజేపీ గెలిచిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో మాత్రం ముఖ్యమంత్రుల ఎంపిక ఇప్పటికీ పూర్తిగా కాలేదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ముఖ్యమంత్రులను ప్రకటించింది బీజేపీ. ఇక మిగిలింది రాజస్థాన్. ఇక్కడ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా షాకింగ్ నిర్ణయాలు వస్తాయని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. రాజస్థాన్ లో కూడా అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉందని లెక్క వేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ నుంచి సీఎం వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. అలాగే మహిళా ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ కూడా ఉందని అంచనా. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వసుంధర రాజే కి అవకాశం దొరకదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే.. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా కొత్తవారికే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు.
పూర్తిగా చదవండి..Rajasthan CM: లేట్ అయినా లేటెస్టుగా..రాజస్థాన్ లోనూ బీజేపీ కొత్త ఫార్ములా..
మూడు రాష్ట్రాలలో గెలుపు తరువాత ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ ఆలస్యం చేసినా.. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో సీఎంలు గా కొత్తవారిని ఎంపిక చేసిన బీజేపీ అదే తరహాలో రాజస్థాన్ ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
Translate this News: