మాజీ సీఎంకు భారతరత్న.. జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌కు అత్యున్నత పురస్కారం

బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. జననాయక్‌గా పేరున్న దివంగత కర్పూరి ఠాకూర్‌ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేశారు. శత జయంతి సందర్భంగా ఆయనకు పురస్కారం అందిస్తూ కేంద్రం ప్రకటన చేసింది.

New Update
మాజీ సీఎంకు భారతరత్న.. జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌కు అత్యున్నత పురస్కారం
Bharat Ratna Award: బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు (Karpoori Thakur) కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. జననాయక్‌గా పేరున్న దివంగత కర్పూరి ఠాకూర్‌ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేశారు. శత జయంతి సందర్భంగా ఆయనకు పురస్కారం అందిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆయన రెండుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ తరఫున ఒకదఫా ఆ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించారు. జాతీయోద్యమంలోనూ ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు.

Advertisment
తాజా కథనాలు