Bigg Boss 7 Telugu: "వాళ్లకు నేనెందుకు సారీ చెప్పాలి".. నాగార్జున తో శివాజీ వాదన..!

బిగ్ బాస్ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల తప్పులను గురించి మాట్లాడుతూ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. శోభ, ప్రియాంకల ప్రవర్తనను ఉద్దేశించి "మా ఇంట్లో ఆడవాళ్లైతే పీక మీద కాలేసి తొక్కుతా" అని శివాజీ పాస్ చేసిన స్టేట్మెంట్ పై నాగార్జున సీరియస్ అయ్యారు.

Bigg Boss 7 Telugu: "వాళ్లకు నేనెందుకు సారీ చెప్పాలి".. నాగార్జున తో శివాజీ వాదన..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ వారం హౌస్ మేట్స్ మధ్య బాగానే గొడవలు జరిగాయి. ఇంటి సభ్యులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్తూ.. వాదించుకున్నారు. ఇక నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాదనల పై క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు చేసిన తప్పులు, ప్రవర్తించిన తీరు పై సీరియస్ గా క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా శివాజీ.. ప్రియాంక, శోభలను ఉద్దేశించి మాట్లాడిన మాటలపై బాగా సీరియస్ అయ్యారు.

publive-image

ఛీ.. తూ అంటే బాగుందా

ముందుగా నాగార్జున యావర్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. ఆ తర్వాత శోభ, యావర్ గొడవకు సంబంధించిన వీడియోను చూపించారు. ఆ వీడియోలో యావర్ శోభను పదే పదే ఛీ.. తూ అని మాట్లాడడం పై సీరియస్ గా క్లాస్ ఇచ్చారు. నిన్ను కూడా ఛీ.. తూ అంటే బాగుంటుందా.. ఈ బిహేవియర్ బాగాలేదు అని కోప్పడ్డారు నాగార్జున.

publive-image

మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఇలాగే చేస్తావా..?

ఆ తర్వాత శివాజీ శోభ, ప్రియాంక ప్రవర్తనను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను చూపించారు. ఆ వీడియోలో శివాజీ మా ఇంట్లో ఆడవాళ్ళైతే ఒక్కటి పీకుతా అని మాట్లాడాడు. దీని పై నాగార్జున మాట్లాడుతూ.. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళైతే ఇలాగే చేస్తావా అని క్లారిటీగా అడిగారు. దానికి శివాజీ అవును కొడతాను అని చెప్పాడు. దాంతో నాగార్జున సీరియస్ అయ్యారు. శివాజీ మా ఇంట్లో ఆడపిల్లలు అయితే పీక మీద కాలేసి తొక్కుతా అని మాట్లాడిన మరో వీడియోను చూపించి.. "ఆ మాటలు ఏంటి శివాజీ అని కోప్పడ్డారు". దానికి శివాజీ రెండు వారల నుంచి వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయాను.. అమర్, ప్రియాంక, శోభ ముగ్గురు ప్రశాంత్ ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రశాంత్ ఏది మాట్లాడిన.. ముగ్గురు వాడి పై అరుస్తున్నారు అని చెప్పాడు. దాని వల్లే కోపంతో అలా అన్నాను.. అది నా పొరపాటే అని తెలిపాడు.

publive-image

నాగార్జున తో శివాజీ వాదన

ఇక నాగార్జున "మా ఇంట్లో ఆడపిల్లలు అయితే పీక మీద కాలేసి తొక్కుతా" అనడం పొరపాటు కాదు తప్పు అని శివాజీ పై సీరియస్ అయ్యారు. నాగార్జున ఎన్ని సార్లు చెప్పిన పొరపాటులో మాట్లాడిన మాటలే కానీ ఉద్దేశించి మాత్రం అనలేదు అని వాదించాడు. "ఫ్లోలో అంటాము చేస్తామా సార్ అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు". అది కరెక్ట్ కాదు అని నాగార్జున చెప్పగా.. అది తప్పు కూడా కాదని వాదించాడు శివాజీ. మాకే కాదు ప్రేక్షకులకు కూడా తప్పే అనిపించింది అని చెప్పారు.

publive-image

వాళ్ళకెందుకు సారీ చెప్తాను

చాలా సేపు వాదన తర్వాత శివాజీ .. శోభ, ప్రియాంకల పై చేసిన వ్యాఖ్యలకు నాగార్జున ముందు సారీ చెప్పాడు. సారీ మాకు కాదు శివాజీ.. ఆడియన్స్ లోని ఆడపిల్లకు చెప్పాలని అన్నారు నాగార్జున. దానికి శివాజీ "వాళ్లకు నేనెందుకు సారీ చెప్పాలి". అసలు నేను ఆడపిల్లను అనలేదు. "మా ఇంట్లో ఆడవాలైతే అని అన్నానని" రివర్స్ అయ్యాడు. మీ ఇంట్లో ఆడపిల్లైనా.. అమ్మాయే కదా అని కోప్పడ్డారు నాగార్జున. దీంతో శివాజీ సారీ చెప్పాడు.

publive-image

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe