Bigg Boss 7 Telugu: "అమర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడా"..? అందుకే నీ పాయింట్స్ ఇచ్చేశావా..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున టికెట్ టూ ఫినాలే టాస్క్ లో ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ కు స్కోర్స్ ఇచ్చారు. అలాగే హౌస్ మేట్స్ ఆటలో చేసిన తప్పుల గురించి మాట్లాడారు.

New Update
Bigg Boss 7 Telugu: "అమర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడా"..? అందుకే నీ పాయింట్స్ ఇచ్చేశావా..!

Bigg Boss 7 Telugu: ఈ ప్రోమోలో ముందుగా శోభ, శివాజీ ఆట గురించి మాట్లాడారు. మొదటి నుంచి బాగా ఆడారు కానీ లాస్ట్ వీక్ లో డౌన్ అయ్యారు అని వీళ్లిద్దరి ఆటకు 90 మార్కులు ఇచ్చారు. శోభ ఆటలో 100% ఇచ్చావా అని నాగార్జున ప్రశ్నించగా.. శోభ 200% ఇచ్చాను సార్ అని సమాధానం చెప్పింది. మరి 90 మార్కులే ఎందుకు వచ్చాయి అంటూ శోభకు క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత శివాజీని కూడా గేమ్ ఆడలేదని ప్రశ్నించారు. దానికి శివాజీ చెయ్యి నొప్పిగా ఉంది.. సహకరించలేదని తెలిపారు.

publive-image

publive-image

ఆ తర్వాత ప్రియాంక.. గౌతమ్ ను అమర్ కోసం తన పాయింట్స్ ఇవ్వమనడం పై నాగార్జున మాట్లాడారు. "ప్రియాంక టాస్క్ లో గౌతమ్ కు నీ పాయింట్స్ ఎందుకు ఇచ్చావు అని అడిగారు. దానికి ప్రియాంక.. నన్ను కెప్టెన్ చేశాడు ఆ కృతజ్ఞతతో ఇచ్చానని చెప్పింది. దానికి నాగార్జున.. కృతజ్ఞతతో గౌతమ్ కు ఇచ్చిన పాయింట్స్ మళ్ళీ అమర్ కు ఇవ్వమని ఎందుకు అడిగావు.. అదేదో ముందే అమర్ కు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. ఇక ప్రియాంక నా మైండ్ లో ఇద్దరు ఉన్నారు అని చెప్పింది.

publive-image

ఇక నాగార్జున.. ఈ విషయంలో అమర్ నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడా..? అందుకే గౌతమ్ ను అమర్ కు పాయింట్స్ ఇవ్వమని చెప్పావా అని నవ్వుతూ అడిగాడు. ప్రియాంక కూడా అవును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.

Also Read: Actor Sameer : “అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు”.. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!

Advertisment
తాజా కథనాలు