Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..!

కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్.

Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..!
New Update

Bigg Boss 7:  బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న మొదటి కెప్టెన్సీ(Captaincy) టాస్క్ చివరి దశకు చేరింది. కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ లెవెల్ కు చేరుకున్న జంటలు శివాజీ-ప్రశాంత, సందీప్- అమర్, యావర్- తేజ, శుభ శ్రీ- గౌతమ్.. ఇక ఫైనల్ టాస్క్ ఆడే ఈ జంటలకు బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

ఇక కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఉత్తరాలను(Letter's) త్యాగం చేయాల్సి ఉంటుందని.. షాక్ ఇస్తారు దాంతో ఎవరు లెటర్ త్యాగం చేయాలనీ ఇరు జంటలు మధ్య చర్చలు జరుగుతాయి. ఇక్కడున్న ట్విస్ట్  లెటర్ త్యాగం చేసిన వాళ్ళు కాకుండా చదివిన వాళ్లే కంటెండర్ అవుతారు.

తెలుగు పంతుళ్ళుగా మారిన హౌస్ మేట్స్ ..

యావర్ తరచూ ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతున్నాడని బిగ్ బాస్ ఇంటి సభ్యులు తెలుగు టీచర్లు గా మారి యావర్ కు తెలుగు నేర్పండని చెప్తారు. దాంతో అందరు సభ్యులు వచ్చి బోర్డు పై యావర్ కు తెలుగు పాటలు చెప్తారు. తేజ, యావర్ ఇద్దరు చాలా ఫన్ క్రియేట్ చేస్తారు.. ఆహ్లాదకరంగా ఈ టాస్క్(Task) ముగుస్తుంది.

రేసు నుంచి ప్రియాంక, శోభా ఔట్.. 

ఇక కెప్టెన్సీ టాస్క్ లో అందరికంటే తక్కువ స్టార్లు గెలుచుకున్న ప్రియాంక, శోభా కంటెండర్ రేస్ నుంచి తొలగిపోతారు. దాంతో ప్రియాంక శోభా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. శోభా తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే ఓడిపోయాము అన్నట్లు గా ప్రియాంక కామెంట్ చేస్తుంది.

తేజాకు యావర్ షాక్

లెటర్ కోసం యాక్టివిటీ రూమ్ లోకి వెళ్లిన తేజా, యావర్ వారి ఇంటి సభ్యులు(House Mates) పంపిన ఉత్తరాలను చూసి ఏడ్చేస్తారు. వెంటనే తేజ నీ కోసం నేను త్యాగం చేస్తానంటూ యావర్ కే లెటర్ ఇచ్చేస్తాడు. కానీ యావర్ నేను  ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్ళలేనని, తేజా చెప్తున్నా వినకుండా తన లెటర్ ను ష్రెడ్ చేస్తాడు. తేజ.. బిగ్ బాస్ ఇది ఒప్పుకోను నేను లెటర్ యావర్ కె ఇవ్వండి అంటూ బాధపడతాడు.

కిందపడి ఏడ్చిన యావర్

లెటర్ చిరిగిపోయేసరికి యావర్(Yavar) తట్టుకోలేక కిందపడి వెక్కి వెక్కి  ఏడుస్తాడు. ఇక తేజ నేను నిన్ను ఇలా చూడలేను అంటూ యావర్ ను ఓదారుస్తాడు. లెటర్ చదివిన తేజ వాళ్ళ నాన్న రాసిన మాటలు చూసి ఆ బాగా ఏడుస్తాడు.

శుభ శ్రీ గౌతమ్ గొడవ

లెటర్ ఎవరు చదవాలి అనే విషయం పై వీళ్లిద్దరికీ చిన్న గొడవ జరుగుతుంది. గౌతమ్ .. నేను లెటర్ చదివి కెప్టెన్సీ టాస్క్ లో అయితే నిన్ను సేవ్ చేస్తా అంటాడు. దానికి శుభ శ్రీ నేను కూడా అవ్వగలను నేనే లెటర్ చదువుతా అంటుంది. గౌతమ్ సీరియస్ అయ్యి సరే నువ్వే తీస్కో అని తన లెటర్ ష్రెడ్ చేయబోతుంటే శుభ లేదు నేనే చేస్తానని ముందుకు వస్తుంది. తన అక్క రాసిన లెటర్ పోయిందని శుభ గౌతమ్ పై కాస్త కోపంగా ఉంటుంది.

చివరికి తేజ, గౌతమ్ వారి కుటుంబ సభ్యల నుంచి వచ్చిన ఉత్తరాలను చదవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్స్ కూడా అవుతారు. ఇక శివాజీ, పల్లవి ప్రశాంత్ లో ప్రశాంత్ కె లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శివాజీ చాలా మెచ్యూర్ గా గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది.

Also Read: Bigg Boss 7 Promo: ఇంటి సభ్యులను ఏడిపించిన బిగ్ బాస్.. లెటర్ కోసం కన్నీటి దారాలు..?

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-contestants #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe