/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ramoji-jpg.webp)
మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శిలతో తమకు రావాల్సిన వాటా గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదలో గాదిరెడ్డి యూరిరెడ్డి, పేర్కొన్నారు. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి కొడుకు యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారనిగతంలో షేర్ల గురించి అడుగుతే బెదిరించారని ఫిర్యాదు తెలిపారు. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది.