Bhavanipeta students protested: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల పరిధిలోని భవానిపేటలో విద్యార్థులు రోడ్డెక్కారు. మండల ప్రాథమిక పాఠశాలలో 95 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఆ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నాడు. అతను కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి సరిగ్గా పాఠశాలకు రావడం లేదు.దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చదువుచెప్పే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు టీచర్ కావాలి, విద్యాధికారుల నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్ కావాలని డిమాండ్..!
ప్రభుత్వం చెబుతోంది ఒకటి అమలు చేస్తోంది మరోటిలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామస్థాయిలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడంలేదు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో ఒక్క ఉపాధాయుడు మాత్రమే ఉంటున్నాడు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారింది
Translate this News: