Jobs Alert: నిరుద్యోగులూ బీఅలర్ట్...ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!!

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు.ఈ పోస్టులన్నీ ఈ వారంలోనే దరఖాస్తు చేసుకోవాలి.

New Update
Jobs Alert: నిరుద్యోగులూ బీఅలర్ట్...ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!!

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పలు ప్రభుత్వ రంగ సంస్థలు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి. ప్రధానంగా టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్సు వంటి పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ వారం దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఉద్యోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎన్టీపీసీ:
ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ మైనింగ్ ఓవర్ మ్యాన్, మ్యాగజైన్ ఇన్ ఛార్జీ మెకానికల్ సూపర్ వైజర్ వంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఎన్టీపీసీ పోర్టల్ careers.ntpc.co.in ద్వారా డిసెంబర్ 31వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తంగా 114 పోస్టులను భర్తీ చేస్తోంది. రాతపరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

స్టాఫ్ నర్స్:
అస్సాంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ ఈ మధ్యే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. గడువు డిసెంబర్ 22న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nhm.assam.gov.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తంగా 400ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెలక్ట్ అయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 18వేలు లభిస్తుంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టున్నారు.

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్:
సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం డిపార్ట్ మెంటల్ రిక్రూట్ మెంట్ చేపడుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్లో డిసెండర్ 23లోపు దరఖాస్తులు సమర్పించాలి. అప్లికేషన్స్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 3ఏళ్లు సర్వీస్ తో సీసీఎల్ లో శాశ్వత ఉద్యోగాలు అయి ఉండాలి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ప్రస్తుతానికి 109 ఖాళీల భర్తీ కానున్నాయి.

వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్:
క్లర్క్ పోస్టుల భర్తీకి వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ wbpsc.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 8నుంచి ప్రారంభమైంది. ఈ గడువు డిసెంబర్ 29న ముగించనుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ స్కిల్స్ పై అవగాహన ఉండాలి.

హర్యానా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్:
హర్యానా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేటెస్టుగా అప్లికేషన్ ప్రాసెస్ ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ hpsc.gov.in ద్వారా డిసెంబర్ 21వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుగా రూ. 1000చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 121 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో డీఎస్పీ, నాయబ్ తహసీల్దార్, ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ ఆఫీసర్, ట్రాఫిక్ మేనేజర్, బ్లాక్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఇక స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి యూపీపీఎస్సీ తాజాగా రిక్రూట్ మెంట్ ను చేపడుతోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ uppsc.up.nic.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయ్యింది. 2024 జనవరి 1 తో ఈ గడువు ముగుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయనుంది. అందులో స్టాఫ్ నర్సు యునాని 2 పోస్టులు, మిగతా 25 పోస్టులు ఫిమేల్ యునాని అభ్యర్థుల నుంచి భర్తీ చేస్తారు. దరఖాస్తుదారులు ఇంటర్ లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వం గుర్తించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు! ఎక్కడెక్కడంటే?

Advertisment
తాజా కథనాలు