ICC WORLD CUP 2023: ఆటపాటలతో పాటు భారత వైమానిక పాటవాన్నీ ప్రదర్శించేలా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. విశ్వ క్రికెట్ విజేత స్థానానికి భారత్ అడుగు దూరంలో నిలిచిన వేళ అభిమానుల కేరింతలు, హర్షధ్వానాల నడుమ తుదిసమరాన్ని క్రికెట్ బోర్డు రక్తిగట్టించబోతున్నది.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్కు ముందే వేడుకలు నింగినంటుతాయి.
ధూంధాంగా ‘ఫైనల్’ వేడుక: ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన బీసీసీఐ
కంగారూలతో భారత్ తలపడుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నది. ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సర్వం సిద్ధం చేసింది. లేజర్ షోతో అభిమానులను మంత్రముగ్ధులను చేయబోతున్నది. వైమానిక దళ విన్యాసాలు ప్రదర్శనలో హైలైట్ కాబోతున్నాయి.
Translate this News: