ఆ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడు.. వైసీపీ నేత ఆరోపణలు

వైసీపీ నేత బరిగల కోటేష్ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై సంచలన ఆరోపణలు చేశారు. రక్షణనిధి టీడీపీకి అమ్ముడుపోయాడని, సీఎం జగన్ పేరు చెడగొడుతున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు.

ఆ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడు.. వైసీపీ నేత ఆరోపణలు
New Update

వైసీపీ నేత బరిగల కోటేష్ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై సంచలన ఆరోపణలు చేశారు.  ఎన్టీఆర్ జిల్లా లోని తిరువూరు ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడని తీవ్రంగా విమర్శించారు. దళిత, వికలాంగ యువతిపై హత్యాచారం చేసిన విషయాన్ని ఎందుకు బయటకు రానివ్వడం లేదంటూ కోటేష్ ప్రశ్నలు సంధించారు.

publive-image

ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన కోటేష్‌.. దళితుడైన ఎమ్మెల్యే రక్షణనిధి దళితులకు అన్యాయం జరుగుతుంటే ఎం చేస్తున్నాడని నిలదీశారు. ఆరునెల గర్భవతి అయిన వికలాంగ దళిత యువతి గర్భాన్ని రహస్యంగా ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆ కేసులో పోలీసులు, స్థానిక ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. రక్షణ నిధికి సీటు రాదనే టీడీపీకి మద్దతుగా ఉన్నారా? ఆ యువతికి నేను అండగా ఉంటాను. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. ఇక దళిత పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత ఎమ్మెల్యే రక్షణ నిధి చేస్తున్న విధానంపై కచ్ఛితంగా పోరాటం చేస్తానన్నారు. ఎస్సీల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి పేరు చెడగొట్టడంలో రక్షణ నిధి ఉన్నారని విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి : NIA Raids: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు

అలాగే ముఖ్యమంత్రి ఆశయాలను చెడగొడుతున్న రక్షణ నిధి ఎమ్మెల్యేగా అనర్హుడని పేర్కొన్నారు. మూడోసారి టిక్కెట్ కోసం తాపత్రయ పడుతున్న రక్షణ నిధి ఎందుకు యువతకి న్యాయం చేయలేదని అడిగారు. తిరువూరులో వైసీపీ తరఫున బరిలో నిలబడి తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ దళిత మహిళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

#rakshana-nidhi #barigala-kotesh #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe