Banking Sector 2023: రెండు వేల నోటూ.. యూపీఐ..  ఈ ఏడాది బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులివే 

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు.. కొన్ని జేబులు ఖాళీ చేసేవి.. మరికొన్ని కాస్త ఊరట ఇచ్చేవి. బ్యాంకింగ్ వ్యవస్థలో రెండువేల నోట్లు ఈ ఏడాది సెలవు తీసుకున్నాయి. లోన్స్ విషయంలో ఆర్బీఐ కఠిన నిబంధనలు తెచ్చింది. యూపీఐ రూల్స్ మారాయి. 

New Update
Banking Sector 2023: రెండు వేల నోటూ.. యూపీఐ..  ఈ ఏడాది బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులివే 

Banking Sector 2023:  సంవత్సరం చివరి నెల ముగియడానికి కొద్ది రోజలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.  ఇవి సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 2023 సంవత్సరంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో (Banking Sector 2023)అనేక పెద్ద మార్పులను చేసింది. 2,000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవడం దగ్గర నుంచి UPI నిబంధనల వరకూ చాలా పెద్ద మార్పులు వచ్చాయి. తాజాగా ఆర్‌బీఐ యూపీఐ నిబంధనలను కూడా మార్చింది. అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. 

Banking Sector 2023: రూ. 2000 నోట్లు చెలామణిలో లేవు

ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దుమారం రేగింది. మే 19, 2023న రూ. 2,000 నోటు చెలామణి నుంచి తప్పించింది. అంటే ఈ నోట్లు ఇకపై రిజర్వ్ బ్యాంక్‌లో ముద్రించరు.  దీని వెనుక క్లీన్ నోట్ విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ ఉదహరించింది. రూ.2,000 నోట్లు చట్టవిరుద్ధం కానప్పటికీ, అవి ఇప్పటికీ చట్టబద్ధమైన చెల్లుబాటులో ఉన్నాయి. రూ.2000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి దాదాపు 4 నెలల సమయం ఇచ్చారు. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి.

Banking Sector 2023: అసురక్షిత రుణాలపై RBI చర్య

రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీ జేబుపై భారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డులు లేక వినియోగదారుల రుణాలు తీసుకోవడానికి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి, RBI ఇప్పుడు బ్యాంకులు - నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వినియోగదారుల క్రెడిట్ రుణాల రిస్క్ వెయిటేజీని 25 శాతం పెంచింది. అంటే అసురక్షిత రుణాలు మునిగిపోతాయనే భయం దృష్ట్యా, బ్యాంకులు ఇప్పుడు మునుపటి కంటే 25 శాతం ఎక్కువ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాంకులు - ఎన్‌బిఎఫ్‌సిలకు వినియోగదారుల క్రెడిట్ రిస్క్ వెయిటేజీ 100 శాతంగా ఉంది, ఇప్పుడు దానిని 125 శాతానికి పెంచారు.

Also Read: టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బు లోన్ రికవరీకి పోకుండా ఉండాలంటే ఇలా చేయండి.. 

Banking Sector 2023: ఈ మార్పులు UPIలో 

ఈ ఏడాది UPI చెల్లింపు లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ పెంచింది. UPI లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అయితే, ఆసుపత్రులు - పాఠశాలలు, కళాశాలలలో UPI లావాదేవీల కోసం మాత్రమే ఈ సౌకర్యం అందించారు. 

Banking Sector 2023: ఏప్రిల్ నుంచి రెపో రేటు పెంచలేదు

ఏప్రిల్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అన్ని మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. రెపో రేటును చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పెంచారు. సరళంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం - ప్రజల జేబులను దృష్టిలో ఉంచుకుని, RBI EMI ధరను పెంచలేదు.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు