బండి సంజయ్‌ ఓ బిత్తిరి సత్తి: రేవంత్‌రెడ్డి ఆగ్రహం

ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ వ్యూహాలపై దూకుడు పెంచారు. త్వరలోనే ప్రజల సమస్యల ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ తరహాలోనే ప్రతిపక్షాల నేతలపై.. అధికారం పార్టీ నేతలపై వరస ట్విట్‌ విసురుతూ ప్రజల ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

New Update
బండి సంజయ్‌ ఓ బిత్తిరి సత్తి: రేవంత్‌రెడ్డి ఆగ్రహం

Bandi Sanjay O Bitthiri Satti Revanth Reddy anger

మ్యానిఫెస్టోకి రంగ సిద్ధం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఖమ్మంలో జరుగుతోన్న భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. భట్టి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ నెల 2వ తేదీన జరగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భట్టి పాదయాత్ర కాంగ్రెస్‌కే కాదు.. యావత్ తెలంగాణకు మేలు చేస్తుందని అన్నారు. భట్టి పాదయాత్ర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మేల్కొలిపిందన్నారు.

భట్టి సభకు అగ్రనేత..

పీపుల్స్ మార్చ్ యాత్రలోని ప్రజా సమస్యల అంశాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి యాత్ర సాగిందన్నారు. భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నిర్వహిస్తోన్న జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని.. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్దేశించబోతుందనన్నారు.

తెలంగాణ ముఖచిత్రం మారబోతుంది

వచ్చే ఎన్నికల కోసం ఖమ్మం సభ నుండే రాహుల్ సందేశం ఇవ్వబోతున్నారని.. ఖమ్మంలో రాహుల్‌గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖచిత్రం మార్చబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ మొజంజాహీ మార్కెట్‌లో గులాబీ పూలు అమ్ముకునేవాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ ఓ బిత్తిరి సత్తి అని.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్, రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లపై ఐటీ చేసిన దాడుల్లో దొరికిన ఆస్తులు ఎన్నో బయట పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశాడు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొత్త పదవులు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్‌లు నియమించింది ఏఐసీసీ. రాష్ట్రంలో మొదటి సారి 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు.

New Update
V BREAKING

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్‌లు నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఏడుగురు సభ్యులున్న డీలిమిటేషన్ కమిటీ చైర్మన్‌గా వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో మొదటి సారి15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. అడ్వైజరీ కమిటీలో రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డి, జానారెడ్డిలకు చోటు దక్కింది.

16 మందితో సంవిధాన్ బచావో ప్రొగ్రాం కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొగ్రాం కమిటీ చైర్మన్‌‌గా బాధ్యతలు పి.వినయ్ కుమార్‌కు అప్పగించారు. సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్, నర్సారెడ్డి మరి కొందరు ఉన్నారు. పీపీసీ కార్యవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల గురించి ప్రస్తావించలేదు AICC. 22 మందితో పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఉన్నారు. డీలిమిటేషన్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కమిటీలో తెలంగాణ ఇంఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీలకు స్థానం కల్పించారు. 

telangana | congress-party | Revanth Reddy | minister-uttam-kumar | cm revanth | latest-telugu-news

 

Advertisment
Advertisment