Balapur Laddu Auction : మరోసారి రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ!

ఈ యేడాది బాలాపూర్ లడ్డూ భారీ ధర పలికింది. భారీ అంచనాలనడుమ రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. స్థానికులు, ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడ్డారు. గతేడాదికంటే మూడు లక్షలుపెరిగింది.

New Update

Balapur Laddu Auction: 1994నుంచి ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఎప్పటిలాగే ఘనంగా జరిగింది. ఈ యేడాది బాలాపూర్ లడ్డూ భారీ ధర పలికింది. భారీ అంచనాలనడుమ 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. స్థానికులు, ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడ్డారు. గతేడాదికంటే 3 లక్షలు పెరిగింది. 

ఈ మేరకు 2023 లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు నిర్వాహకులు. ముందుగా 27లక్షలు కట్టిన వాళ్ళకే వేలంలో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడ్డారు.

ఇదిలా ఉంటే.. ఉదయం 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. ఊరేగింపు తర్వాత బోడ్రాయి దగ్గర లడ్డూ వేలం పాట జరిగింది. అనంతరం శోభాయాత్ర కొనసాగిస్తూ గతేడాదిలాగే సాయంత్రం 4 గంటలకు నిమజ్జనం చేయనున్నట్లు నిర్వహాకులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు