జైల్ నుంచి బయటపడ్డారు
ఇబ్రహీంపట్నం గురునానక్ యూనిర్సిటీ దగ్గర ఆందోళన చేపట్టిన క్రమంలో అరెస్ట్ అయిన ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్కు బెయిల్ ఇచ్చారు. ఈరోజు ఉదయం ఇబ్రహీంపట్నం జడ్జి నివాసంలో పోలీసులు ఎన్ఎస్యూఐ నేతలను ప్రవేశపెట్టారు. ఈక్రమంలో జడ్జి అతనికి షూరిటీలతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు.
30వేల చొప్పున రెండు షూరిటీలు
ఒక్కొక్కరికి రూ. 30వేల చొప్పున 2 షూరిటీల ఇవ్వాలని ఆదేశించారు. అయితే బలమూరి వెంకట్తో పాటు ఎన్ఎన్యూఐ నేతలు కార్తీక్ పటేల్ నందకిషోర్, శివ , యాదయ్యలకు బెయిల్ మంజూరైంది. ఇక గురువారం ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు ఎన్ఎస్యూఐ నేతలు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు చేపట్టారంటూ ఆందోళన చేశారు.
గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యం తీరుతో 4000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందంటూ వారి తల్లిదండ్రులతో కలిసి ఎన్ఎస్యూఐ ఆందోళనకు దిగింది. ఇక పోలీసులు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తోపాటు మిగతా వారిని అరెస్టు చేసి మాడ్గుల పోలీస్ స్టేషన్కు తరలించారు.